telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

ఆ యోధులకు ప్రతిరోజు నివాళులు అర్పించాలి: పవన్ కల్యాణ్

pawan

భారతదేశం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యజించి మార్చి 23 న భరతమాత ముద్దుబిడ్డలు భగత్ సింగ్, సుఖ్ దేవ్ థాపర్, రాజ్ గురులు అమరులయ్యారని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. ప్రతి ఒక్క భారతీయుడు ఈ ముగ్గురు యోధులకు ఈ ఒక్కరోజే కాకుండా ప్రతిరోజూ నివాళులు అర్పించాలని సూచించారు.

ఈ రోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ, స్వాతంత్ర్యం వారి త్యాగాల ఫలితమేనని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. జనసైనికుల తరఫున కూడా తాను ఘనంగా నివాళులు అర్పిస్తున్నానని తెలిపారు. ఆ మహోన్నత మూర్తులకు అభివందనాలు అంటూ ట్విట్టర్ లో స్పందించారు. భారతదేశ చరిత్రలో మార్చి 23 ఓ విషాద దినం అని అభివర్ణించారు.

Related posts