telugu navyamedia
రాజకీయ వార్తలు

ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో.. బీఎస్పీ అభ్యర్థిపై కర్రలతో దాడి

New couples attack SR Nagar

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగుతోంది. కాంగ్రెస్, బీజేపీ, ఆప్ ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో బహుజన్‌ సమాజ్‌ పార్టీ(బీఎస్పీ) అభ్యర్థి నారాయణ్‌ దత్త్‌ శర్మపై బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కర్రలతో దాడి చేశారు.

బాదర్‌పూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నారాయణ్‌ దత్త్‌.. నిన్న రాత్రి ఎన్నికల ప్రచారంలో పాల్గొని తిరిగి ఇంటికి వస్తున్నారు. ఈ క్రమంలో బీఎస్పీ అభ్యర్థి కారును 8 నుంచి 10 మంది గుర్తు తెలియని వ్యక్తులు ఆపారు. ఆ తర్వాత కారుపై దాడి చేశారు. నారాయణ్‌ దత్త్‌పై కర్రలతో దాడి చేయడంతో అతని తలకు, ముఖంపై గాయాలయ్యాయి. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ప్రత్యర్థులు తనపై దాడి చేశారని నారాయణ్‌ దత్త్‌ తెలిపారు. తనపై దాడి చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఎస్పీ అభ్యర్థి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Related posts