telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వైద్యులకు అండగా ఉండండి.. జనసైనికులకు పవన్ ట్వీట్

pawan

దేశంలోని పలు ప్రాంతాల్లో వైద్య సిబ్బందిపై జరుగుతున్న దాడులను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఖండించారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో సేవలందిస్తోన్న వైద్యులు, వైద్య సిబ్బందిపై దాడులు సరికాదన్నారు. మనందరం ఇటువంటి పిరికి చర్యలను ఖండించాలన్నారు. జనసైనికులు వైద్యులకు మద్దతుగా నిలబడండని పవన్ ట్వీట్ చేశారు.

లాక్‌డౌన్‌ నేపథ్యంలో సేవలందిస్తోన్న జనసేన కార్యకర్తలకు పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.హైదరాబాద్ జనసేన పార్టీ ఆఫీసు లో పనిచేసే తూ. గో జిల్లా, పిఠాపురానికి చెందిన శ్రీ సంతోష్ దుర్గ తన రెండు నెలల జీతాన్ని కరోనా కష్టకాలంలో పీఎం కేర్స్‌ ఫండ్ కి విరాళం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు’ అని ట్వీట్ చేశారు.

హిందూపురం నియోజకవర్గ పరిధిలో నిత్యం 200 మందికి అన్నదానం చేయడంతో పాటు వివిధ గ్రామాల్లో నిరుపేదలకు కూరగాయలు, నిత్యావసరాలు పంపిణీ చేస్తున్న ఆకుల ఉమేశ్‌కి పవన్‌ అభినందనలు తెలిపారు. ‘హిందూపూరం నియోజకవర్గానికి చెందిన జనసేన నాయకుడు శ్రీ ఆకుల ఉమేష్ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

Related posts