telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఫోన్ ట్యాపింగ్ వైసీపీకి అలవాటే: చంద్రబాబు

chandrababu

ఫోన్ ట్యాపింగ్ పై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది వైసీపీకి ఎప్పట్నించో ఉన్న అలవాటని విమర్శించారు. గతంలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఫోన్ కూడా వైసీపీనే ట్యాప్ చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో ఫోన్ల ట్యాపింగ్ పై చర్యలు తీసుకోవాలంటూ తాను ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాస్తే, ఏపీ డీజీపీ స్పందించడం విడ్డూరంగా ఉందని అన్నారు.

ట్యాపింగ్ పై సాక్ష్యాలు కావాలని డీజీపీ తనకు లేఖ రాయడం పట్ల చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. సాక్ష్యాలు కోరుతున్న డీజీపీ గతంలో రాసిన లేఖలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పగలరా? అని ప్రశ్నించారు. ఇప్పుడు డాక్టర్ల ఫోన్లను కూడా ట్యాప్ చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.

Related posts