హేతుబద్దంగా రాష్ట్ర విభజన చేసి మనల్ని కట్టుబట్టలతో నెట్టేశారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆయన అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ తాను అభివృద్ధి చేసిన హైదరాబాద్ బంగారు బాతును అప్పనంగా కేసీఆర్ కొట్టేశారని బాబు వ్యాఖ్యానించారు.
హైదరాబాద్ని అమరావతి మించిపోతుందనే భయంతోనే.. జగన్తో కేసీఆర్ చేతులు కలిపారని చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శించారు. జగన్ తన దొంగ ఆస్తులు కాపాడుకోవాలని, కేసుల నుంచి బయటపడాలనే కేసీఆర్తో చేతులు కలిపి ఏపీని దెబ్బతీస్తున్నారని ఆరోపించారు.మనల్ని అడ్డుకునేందుకు కేసీఆర్, మోదీ ఏకమయ్యారని సీఎం మండిపడ్డారు. కేసీఆర్ మనకు భిక్షం వేస్తామన్నారని, అవసరమైతే తానే మీకు రూ.500 కోట్లు ఇస్తానని చంద్రబాబు అన్నారు.