పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు టీడీపీ ఎమ్మేల్యే నిమ్మల రామానాయుడు సైకిల్ యాత్రలో స్వల్ప అపశృతి చోటుచేసుకుంది . ఎమ్మెల్యే నిమ్మల ప్రమాదవశాత్తు కింద పడటంతో ఆయన ఎడమ కాలికి స్వల్ప గాయాలయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమడోలు మండలం గుండుగోలను సమీపంలో ఈ ఘటన జరిగింది. .
పేదల సొంతింటి కలను నెరవేర్చడానికి టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఉచితంగా అందజేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సైకిల్ యాత్ర ప్రారంభించారు. ఈ మేరకు ఆయన పాలకొల్లు టిడ్కో ఇళ్ల నుంచి అమరావతి అసెంబ్లీ వరకు శుక్రవారం సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టారు.
అందులో భాగంగా ఆయన భీమడోలు మండలంలో సైకిల్ యాత్ర నిర్వహిస్తుండగా శింగవరం వద్ద రోడ్డుపై ప్రమాదవశాత్తు కిందపడి కాలికి స్వల్ప గాయమైంది. ప్రాథమిక చికిత్స అనంతరం నిమ్మల తన సైకిల్ యాత్రను కొనసాగిస్తున్నారు.