పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను కొనసాగిస్తున్ననవయుగ సంస్థను ఏపీ ప్రభుత్వం పక్కన పెట్టింది. ఈమేరకు ఇరిగేషన్ శాఖ నోటీసులు జారీ చేసింది. నిర్మాణ పనుల నుంచి వైదొలగాలని నవయుగకు నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రీక్లోజర్ నోటీసులను అందించింది. ప్రస్తుతం పోలవరంలో 60సి నిబంధన ప్రకారం హెడ్ వర్క్ పనులను నవయుగ చేస్తోంది.
దాదాపు రూ. 3 వేల కోట్ల విలువైన పనులను కొనసాగిస్తోంది. అంతేకాదు రూ. 3,220 కోట్ల విలువైన జల విద్యుత్ టెండర్లను కూడా నవయుగ దక్కించుకుంది. జల విద్యుత్ ప్రాజెక్టు నుంచి కూడా తప్పుకోవాలని నవయుగకు ఇరిగేషన్ శాఖ సూచించింది.పోలవరం ప్రాజెక్టు పనుల్లో అవినీతి చోటు చేసుకుందని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో నిపుణుల కమిటీ తెలిపింది. అంచనాలను పెంచి పనులను చేపట్టినట్టు నివేదికలో పేర్కొన్నట్టు తెలుస్తోంది.