రాష్ట్ర ప్రభుత్వం అసిస్టెంట్ పబ్లిక్ ప్రాజిక్యూటర్(ఏపీపీ) పోస్టులు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 50 పోస్టుల భర్తీకి రాష్ట్రస్థాయి పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటన విడుదల చేసింది. న్యాయవిద్యలో పట్టభద్రులైన ఏపీకి చెందిన అభ్యర్థులు మాత్రమే సెప్టెంబరు 30 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబరు 17న పరీక్ష ఉంటుంది.