ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ అధిష్టానం దాదాపుగా ఖరారు చేసింది. 136 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తమ పార్టీ తరఫున పోటీ పడే అభ్యర్థుల జాబితా సిద్దమైంది. రెండు రోజుల నుంచి ఢిల్లీలో మకాం వేసిన రాష్ట్ర నేతలు అభ్యర్థుల జాబితా విడుదలకు కసరత్తు చేశారు. నేటి సాయంత్రం లేదా రేపు తమ తొలి జాబితా విడుదలవుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇదే సమయంలో ఏపీలో 13 లోక్ సభ స్థానాలకు, తెలంగాణలో మిగిలిన 9 స్థానాలకు నేటి సాయంత్రంలోగా అభ్యర్థులను ఖరారు చేసే లక్ష్యంతో అధిష్ఠానం ఉంది. కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ఆమోదముద్ర వేయించుకున్న తరువాత జాబితా విడుదల చేసే అవకాశం ఉంది.
previous post
next post