మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరామకృష్ణ సత్తెనపల్లిలోని నైపుణ్యాభివృద్ధి సంస్థలో 30 ల్యాబ్టాప్లను తీసుకువెళ్లారనే కేసులో తాజాగా ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. శివరామకృష్ణ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జీకే మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ టి.రజనీలతో కూడిన డివిజన్ బెంచ్ బుధవారం విచారించింది.
ఆయన ల్యాబ్టాప్లు తీసుకువెళ్లారని ఆ సంస్థ అధికారి బాజీబాబు సత్తెనపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నమోదు చేసిన కేసులో తనను అరెస్ట్ చేయకుండా బెయిల్ మంజూరు చేయాలని శివరామకృష్ణ అభ్యర్థనను హైకోర్టు ఆమోదించింది.