ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈరోజు మధ్యాహ్నం జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఎందరో ప్రముఖులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ కు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు.
జగన్ ను గెలిపించిన ఏపీ ప్రజలతో పాటు ఆయన మంత్రివర్గంలో చేరనున్న నేతలకు అభినందనలు తెలిపారు. మరోవైపు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి జగన్ కు శుభాకాంక్షలు చెప్పారు. జగన్ ది గొప్ప విజయమని వ్యాఖ్యానించారు. అలాగే ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ జగన్ కు అభినందనలు తెలిపారు.