telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

“దిశ” చట్టంపై గ్రామ స్థాయిలో చర్చ జరగాలి: వాసిరెడ్డి పద్మ

vasireddy padma ycp

దిశ చట్టంపై గ్రామ స్థాయిలో చర్చ జరగాలని ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. గుంటూరులోని జీజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అత్యాచార బాలికను వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. అనంతరం మీడియాతో ఆమె మాట్లాడుతూ ఐదేళ్ల బాలికపై అత్యాచార ఘటన తీవ్ర ఆవేదన కలిగిస్తోందని వాసిరెడ్డి పద్మ అన్నారు. ఆమె కుటుంబానికి సన్నిహితంగా ఉన్న వ్యక్తే ఈ దారుణానికి పాల్పడటం దారుణమని చెప్పారు.

ఈ ఘటనలో దిశ చట్టాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. మహిళలు, చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడితే మహిళా కమిషన్ చూస్తూ ఊరుకోదని వాసిరెడ్డి పద్మ తెలిపారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారని చెప్పారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధితురాలి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Related posts