దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్ పై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పదించారు. సీఎం కేసీఆర్ మౌనాన్ని తక్కువ అంచనా వేశారని, ఇప్పుడు ఆయన ఉగ్రరూపం చూశారని తెలిపారు. “దిశ” నిందితుల ఎన్కౌంటర్ దేశానికి ఒక మెసేజ్ ఇచ్చిందని మంత్రిచెప్పారు.తప్పు చేస్తే మరణశాసనం అనే భయం ఈ ఎన్కౌంటర్ ద్వారా తెలియాలన్నారు.
గతంలో వికారుద్దీన్, నయీం ఎన్కౌంటర్లు గుర్తుతెచ్చుకోవాలని సూచించారు. తప్పు చేస్తే ఏమవుతుందో ఈ ఘటన ద్వారా మృగాళ్లకు గుర్తుకు రావాలని హెచ్చరించారు. తమ కుటుంబానికి న్యాయం జరిగిందని దిశ కుటుంబ సభ్యులు చెబుతున్నారన్నారు. దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోందన్నారు. ప్రతిపక్షాలకు ఏ అంశాలు లేకపోవటంతో ప్రభుత్వంపై బురద జల్లుతున్నారన్నారు. మానవ హక్కుల నేతల మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.