ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభానికి ఇంకా 8 రోజులు మాత్రమే ఉంది. అయితే ఇలాంటి సమయంలో సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సన్రైజర్స్ స్టార్ ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ లీగ్ నుంచి తప్పుకున్నాడు. కరోనా నేపథ్యంలో కఠిన బయో బబుల్లో ఉండటం కష్టంగా భావించిన మిచెల్ మార్ష్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాడు. కొద్ది రోజుల క్రితమే ఈ విషయాన్ని బీసీసీఐ తో పాటు సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్మేనేజ్మెంట్కు తెలియజేశాడని తాజాగా బయటకు వచ్చింది. ప్రస్తుత ఐపీఎల్ బయో సెక్యూర్ నిబంధనల ప్రకారం.. మార్ష్ ఏడు రోజుల క్వారంటైన్తో పాటు 50 రోజుల కఠిన బయో బబుల్లో ఉండాలి. దీన్ని కష్టంగా భావించిన అతను లీగ్ నుంచి తప్పుకున్నాడు. అయితే మిచెల్ మార్ష్ స్థానంలో సన్రైజర్స్ హైదరాబాద్.. ఇటీవల భారత్తో జరిగిన టీ20 సిరీస్లో సత్తా చాటిన ఓ ఇంగ్లండ్ బ్యాట్స్మన్ను తీసుకుంది. ఈ సీజన్ వేలంలో అమ్ముడు పోనీ జాసన్ రాయ్ హైదరాబాద్ జట్టులో చేరాడు. భారత్తో జరిగిన టీ20 సిరీస్లో జాసన్ రాయ్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. అయితే చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.
previous post
next post