దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ కేసు నిందితులను ఈ రోజు తెల్లవారుజామున తెలంగాణ పోలీసులు ఎన్కౌంటర్ చేయడంపైఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. తాను ఎన్ కౌంటర్లకు వ్యతిరేకమని తన వైఖరి స్పష్టం చేశారు. ఢిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడుతూ ఇలాంటి ఎన్ కౌంటర్లను వ్యక్తిగతంగా తాను ఇష్టపడనని తెలిపారు.
ఈ ఘటనను జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణకు స్వీకరించిందని అసదుద్దీన్ తెలిపారు. సైబరాబాద్ పోలీసులు ఎందుకు ఎన్ కౌంటర్ చేయాల్సి వచ్చిందో, ఎలాంటి పరిస్థితుల్లో ఎన్ కౌంటర్ చేశారో ఈ విచారణలో తేలుతుందని ఆయన అన్నారు.