telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ఇండియా కరోనా అప్డేట్: పెరిగిన కేసులు

దేశంలో కరోనా విజృంభిస్తునే వుంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 1.08 కోట్లు దాటాయి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య. గడచిన 24 గంటలలో 12, 059 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా… కరోనా వల్ల మొత్తం 78 మంది మృతి చెందారు. ఇక గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 11, 805 డిశ్ఛార్జ్ అయ్యారు. దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,08,26,363 కాగా ….దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 1,48, 766 గా ఉన్నాయి. ఇక కరోనా కు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,05,22,601 కి చేరింది. “కరోనా” వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 1,54,996 నమోదైంది. ఇటు దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 97.2 శాతంగా ఉండగా… దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసులు 1.78 శాతంగా ఉంది. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో 1.45 శాతానికి మరణాల రేటు తగ్గింది. ఇటు దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు నిర్వహించిన “కరోనా” టెస్ట్ ల సంఖ్య 20,13,68,378 కు చేరింది.

Related posts