మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. 50 రోజులకు పైగా పలువురు అనుమానితులను ప్రశ్నించారు సీబీఐ అధికారులు. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకుని విచారించిన సీబీఐ తాజాగా పులివెందులకు చెందిన సునీల్ కుమార్ యాదవ్ను గోవాలో అరెస్ట్ చేసింది. గోవాలో అరెస్ట్ చేసిన సీబీఐ అనంతరం అక్కడి స్థానిక కోర్టులో హాజరుపరిచినట్లు అధికారులు వెల్లడించారు. గోవా స్థానిక కోర్టుద్వారా ట్రాన్సిట్ రిమాండ్లో సునీల్ కుమార్ యాదవ్ను కడపకు తీసుకొచ్చారు. వైఎస్ వివేకా హత్యకేసులో అనుమానితుడైన సుశీల్ కుమార్ను ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపారు. ఈ క్రమంలోనే అతడిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. సునీల్ యాదవ్తో పాటు వైఎస్ వివేకా కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన ఎర్రగంగిరెడ్డి, ఉమాశంకర్ను కడప సెంట్రల్ జైలులోని గెస్ట్హౌస్లో సీబీఐ అధికారులు విచారణ జరుపుతున్నారు.
previous post
next post
నారా వారి పాలన కాదు సారా వారి పాలన: ఎమ్మెల్యే రోజా