telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

మర్కజ్‌ కు వెళ్లొచ్చినవారు సమాచారం తెలపాలి: ఒడిశా సీఎం

naveenpatnayak on next pm

ఇటీవల ఢిల్లీలో తబ్లిగీ జమాత్ సంస్థ నిర్వహించిన ఢిల్లీ మర్కజ్‌ ప్రార్థనలకు దేశవ్యాప్తంగా వందల మంది హాజరయ్యారు. వారిలో కొందరు కరోనా బారినపడడంతో అధికారులు క్వారంటైన్ కు తరలించారు. మరికొందరు తప్పించుకొని తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ మర్కజ్‌ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారు స్వచ్ఛందంగా ముందుకు రావాల్సిందిగా ఒడిశా రాష్ట్ర సీఎం నవీన్‌ పట్నాయక్‌ విజ్ఞప్తి చేశారు.

ఢిల్లీలోని తబ్లిగీ జమాతేకు హాజరైన వారు స్వచ్ఛందంగా 104 హెల్ఫ్‌లైన్‌కు కాల్‌ చేసి సమాచారం తెలపాల్సిందిగా కోరారు. దేనిగురించి భయపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వం వారికి అన్ని విధాల అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఒడిశా రాష్ట్రవ్యాప్తంగా ఢిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలో నిర్వహించిన తబ్లిగీ జమాతే ఈవెంట్‌కు హాజరైనట్లుగా సమాచారం. వీరందరి ఆచూకీకి ప్రభుత్వం గాలింపు చర్యలు చేపట్టింది.

Related posts