telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు వార్తలు

ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య…

కట్టుకున్న భర్తను కనీస కనికరం లేకుండా చంపేసింది ఓ భార్య. ప్రియుడి మోజులో పడి తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను పక్కా ప్లాన్ తో ప్రియుడితో కలిసి చంపిన భార్య ఉదంతం కదిరిలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే… అనంతపురం జిల్ల కదిరి పట్టణంలో నివాసం ఉంటున్న నాగభూషణం, ఈశ్వరమ్మ భార్యాభర్తలు. వీరు కొన్ని సంవత్సరాలుగా కదిరి పట్టణంలో నివాసముంటున్నారు. అయితే ఈశ్వరమ్మకు ఒక ప్రైవేట్ పాఠశాలలో పనిచేసే రవి కుమార్ కు పరిచయం ఏర్పడింది. అది కాస్తా అక్రమ సంబంధానికి దారి తీసింది. ఈ వ్యవహారం భర్త నాగభూషణంకు తెలియడంతో భార్య ప్రవర్తన మార్చుకోవాలని పలు సార్లు మందలించినప్పటికీ భార్య ప్రవర్తనలో మార్పు రాలేదు. ఎలాగైనా తన భర్త అడ్డు తొలగించుకోవాలని భావించిన ఈశ్వరమ్మ ప్రియుడిని ఇంటికి పిలిపించుకుంది. ఇద్దరూ కలిసి పక్కా  ప్లాన్ తో భర్త నాగభూషణం దారుణంగా హత్య చేసారు. గుట్టుచప్పుడు కాకుండా రాత్రి సమయంలో మనుషులతో ఆటోలో మృతదేహాన్ని కదిరి పట్టణ సమీపంలోని ముళ్ళ పొదల్లో మృతదేహాన్ని పూడ్చేసింది. అయితే ఈశ్వరమ్మ ఏదో చేసిందని అనుమానించిన బంధువులు పోలీసులకు సమాచారం అందజేయడంతో పోలీసు తనదైన శైలిలో విచారించారు. దాంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

Related posts