telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఈ దాడులకు వారే కారణం : అయ్యన్నపాత్రుడు

cm jagan ycp

పోలిట్ బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ దేవాలయాలపై జరుగుతున్న దాడులకు సీఎం జగన్, డిజిపి గౌతమ్ సవాంగ్ లే కారణమని అన్నారు. రాష్ట్రంలో హిందుత్వాన్ని నాశనం చేయాలని చూస్తున్నారని….వరుసగా గుళ్ళ పై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. అశోక్ గజపతి రాజు గురించి మాట్లాడే అర్హత లేని వాళ్ళు కూడా…ఈ రోజు విమర్శిస్తున్నారన్నారు.  అశోక్ గజపతిరాజు కుటుంబం కోసం, వారి వంశం గురించి తెలుసుకుని మాట్లాడాలని చురకలు అంటించారు. దేవాదాయ శాఖ మంత్రి మాట్లాడే తీరు అప్రజాస్వామికమని.. ముందు దేవాలయాలు పై జరుగుతున్న దాడులకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి వెల్లంపల్లి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. అలాగే అశోక్ గజపతి రాజుకు వెల్లంపల్లి క్షమాపణ చెప్పాలన్నారు. మానస ట్రస్ట్ గురించి కనీసం తెలియని మహిళను చైర్మన్ గా నియమిస్తారా.? విజయసాయిరెడ్డి స్థాయి మరిచి మాట్లాడితున్నారని ఫైర్‌ అయ్యారు. వోక్స్ వాగన్ కంపెనీ విశాఖ నుంచి వెళ్లిపోవడానికి కారకుడు  మంత్రి బొత్స అని.. ప్రజలు బొత్స గురించి తెలుసుకున్నారన్నారు. పేకాట క్లబ్ నడిపేవాళ్ళు మంత్రిగా ఉన్నారని మండిపడ్డారు. దేవాలయాలపై జరుగుతున్న దాడులపై రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న  దాడులకు బాధ్యతగా, డీజీపీ ని రీకాల్ చేయాలన్నారు.

Related posts