telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ట్రంప్ కంటే ఘోరమైన ఇబ్బందులను మోడీ పడతాడు…

ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాను టార్గెట్ చేసిన విమర్శలు గుప్పిస్తున్నారు తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. హుగ్లీలోని షాన్‌గంజ్‌లో జరిసన సభలో ఆమె మాట్లాడుతూ.. మోడీ, అమిత్‌షా ద్వయం విపరీతమైన అబద్ధాలను ప్రచారం చేస్తూ, దేశ వ్యాప్తంగా విద్వేషాన్ని పెంచి పోషిస్తున్నారని ఆరోపించారు. మోడీ అల్లర్లు సృష్టించే వ్యక్తి.. అల్లర్ల ద్వారా ట్రంప్ సాధించిందేమి? అంతకంటే ఘోరమైన ఇబ్బందులను మోడీ ఎదుర్కొంటారు అని వ్యాఖ్యానించారు. ఇక, అసెంబ్లీ ఎన్నికల్లో నేను గోల్ కీపర్‌గా ఉంటాను.. బీజేపీ ఒక్క గోల్ కూడా చేయలేదన్నారు.. మరోవైపు.. ఈ ఎన్నికల్లో బెంగాల్‌లో బీజేపీని చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.. బీజేపీని ఒక్కడ ఓడగొడితే.. దేశవ్యాప్తంగా ఆ పార్టీని ఓడించడం అసాధ్యమేమీ కాదని తెలిపారు. నన్ను పాతిపెట్టినా చెట్టులా విస్తరిస్తూనే ఉంటానని వ్యాఖ్యానించిన మమతా.. ఆట మొదలైందన్నారు. కాగా, మమత మేనల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీ వేసిన పరువునష్టం కేసులో.. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు నోటీసులు వెళ్లిన విషయం తెలిసిందే .

Related posts