telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

అర్ధశతకాలు పూర్తి చేసిన శార్దుల్, సుందర్…

బ్రిస్బేన్ లోని గబ్బా వేదికగా భారత్-ఆసీస్ మధ్య నేడు నాల్గవ టెస్ట్ మూడో రోజు ఆటలో యువ ఆటగాళ్లు వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్ కష్టాలో ఉన్న భారత జట్టును ఆదుకుంటున్నారు. ఈ ఇద్దరు ఆటగాళ్లు తమ తమ మొదటి అంతర్జాతీయ అర్ధశతకాలను పూర్తి చేసుకొని సెంచరీ భాగసౌమ్యం నెలకొల్పారు.186 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన భారత జట్టును వీరి బ్యాటింగ్ తో  292/6 తో నిలిపారు. అయితే గబ్బా వేదికగా భారత్ తరపున 7 వ వికెట్ కు అత్యధిక భాగసౌమ్యం నెలకొల్పిన జంటగా వీరు రికార్డు సృష్టించారు. ఇక ఇంతకముందు ఈరోజు ఆట ప్రారంభమైన కొత్త సమయానికే పుజారా(25) రూపంలో మూడో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన మయాంక్ తో మంచి భాగసౌమ్యం ఏర్పాటు చేస్తున్న సమయంలో స్టార్క్ బౌలింగ్ లో క్యాచ్ రూపంలో రహానే పెవిలియన్ కు చేరుకున్నాడు. ఇక రెండో సెషన్ ప్రారంభమైన తర్వాత రెండో బంతికే మయాంక్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత పంత్ కూడా అదే దారిలో పెవిలియన కు చేరుకున్నాడు. అయితే ఈరోజు ఆట ముగియడానికి ఇంకా 26 ఓవర్లు మిగిలి ఉండగా భారత జట్టు ఆసీస్ కంటే ఇంకా 72 పరుగులు వెనుకబడి ఉంది. చూడాలి మరి వీరు ఇలానే ఆడితే ఈరోజు భారత్ ఆధిక్యంలోకి వెళ్లే అవకాశం ఉంది.

Related posts