టాలీవుడ్ యువ హీరోల్లో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు అఖిల్. ఇటీవల అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాను చేశాడు. ఈ సినిమా వేసవిలో విడుదల కానుంది. ఇందులో పూజ హెగ్దె అఖిల్ సరసన నటించింది. అయితే ఈ సినిమా చిత్రీకరణలో ఉండగానే అఖిల్ తన తదుపరి ప్రాజెక్ట్ ఓకే చేశాడు. దర్శకుడు సురేందర్ రెడ్డితో తన తదుపరి చిత్రం చేసేందుకు అఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ సినిమా కోసం అఖిల్ జిమ్ లో కష్టపడుతున్నాడు. ఎందుకుంటే ఈ చిత్రంలో అఖిల్ కండలు తిరిగి కనిపించాలి. అంతేకాకుండా ఈ చిత్రం షూటింగ్ విదేశాలలో కూడా జరగనుంది. దానికి కారణం ఇందులో అఖిల్ ఓ స్పై ఆఫీసర్గా కనిపించనున్నాడు. ఈ సినిమా షూటింగ్ను హైదరాబాద్లో పూజాకార్యక్రమాలతో మొదలు చేసేందుకు మేకర్స్ ఆలోచిస్తున్నారు. ఇక రెగ్యులర్ షూటింగ్ విషయానికొస్తే వచ్చే నెల మొదటి వారంలో ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమా ఇప్పటి వరకు అఖిల్ చేసిన సినిమాల్లోకన్నా భారీ బడ్జెట్గా తెరకెక్కనుంది. దీని షూటింగ్లో మొదటి షెడ్యూల్ నుంచే అఖిల్ పాల్గొననున్నాడు. అయితే ఇందులో హీరోయిన్గా ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి తో చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ విషయంలో ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటనైతే రాలేదు.
previous post
next post
గ్రామ వలంటీర్లను కించపరిచేలా చంద్రబాబు వ్యాఖ్యలు: ఎమ్మెల్యే రజని