telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

కివీస్ పై … శ్రీలంక ఘనవిజయం..

srilanka won on newzeland

న్యూజీలాండ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఆతిథ్య శ్రీలంక బోణీ చేసింది. మొదటి టెస్టులో లంక 6వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. 268పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నే సెంచరీతో మొదటి సెషన్‌లోనే అలవోక విజయం సాధించింది. 133/0 స్కోరుతో ఐదో రోజు మరో ఓపెనర్ తిరుమాన్నెతో కలిసి ఆట ప్రారంభించిన కరుణరత్నే ఆచితూచి ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. సోమర్‌విల్లే ఈ జంటను విడదీయడంతో 161పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాతి ఓవర్‌లో కుసాల్ మెండిస్ ఔటవడంతో క్రీజులోకి వచ్చిన ఏంజెలో మాత్యూస్ కెప్టెన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు.

ఈ క్రమంలోనే కరుణరత్నే బౌండరీతో సెంచరీ నమోదు చేశాడు. నాలుగో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేయడం అతడికి ఇదే మొదటిసారి. విజయానికి 50పరుగులు అవసరమున్న సమయంలో కరుణరత్నే అవుటయ్యాడు. క్రీజులోకి వచ్చిన కుసాల్ పెరీరా బౌండరీలు బాదుతూ రన్‌రేట్ పెంచాడు. పెరీరా ఔట్‌కోసం కివీస్ ఆటగాళ్లు అప్పీల్ చేయగా, అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. కానీ పెరీరా రివ్యూ కోరడంతో నాటౌట్‌గా తేలింది. చివర్లో పెరీరా బౌల్ట్ బౌలింగ్‌లో ఔటైనప్పటికీ మాథ్యూస్ ధనంజయ డిసిల్వాతో కలిసి లాంఛనాన్ని పూర్తి చేశాడు.

Related posts