telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఈ ప్రభుత్వం కుంభకర్ణ ప్రభుత్వం: డీకే అరుణ

DK Aruna comments on congress

తెలంగాణలోని టీఆర్ఎస్ ప్రభుత్వం పై బీజేపీ నేత డీకే అరుణ విరుచుకుపడ్డారు.సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో తీవ్ర కరవు ఉందని.. అయినా ప్రభుత్వంలో చలనం లేదనిధ్వజమెత్తారు. ఇక రైతు రుణమాఫీపై ఇప్పటి వరకూ ఊసే లేదని ఆరోపించారు. ఖరీఫ్ లో రైతులు పెట్టుబడుల కోసం నానా తంటాలు పడుతున్నారన్నారు.

బ్యాంకర్లు కూడా కొత్త రుణం ఇవ్వటం లేదన్నారు. రుణమాఫీ రాకపోవడంతో రైతులు పెట్టుబడుల కోసం అప్పులు చేయాల్సిన పరిస్తితి నెలకొందన్నారు. వెంటనే ప్రభుత్వం వ్యవసాయ ప్రణాళిక విడుదల చేయాలని కోరారు. ఈ ప్రభుత్వం కుంభకర్ణ ప్రభుత్వం అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 25 లక్షల రైతుల డేటాను కేంద్రానికి పంపకపోవడం వల్లే కేంద్రం ఇచ్చే కిసాన్ సమ్మన్ నిధి రాష్ట్రానికి రాలేదని ఆమె పేర్కొన్నారు.

Related posts