telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

హైకోర్టు న్యాయవాది దంపతుల హత్య పై గవర్నర్ లేఖ…

Tamilisai Soundararajan governor

హైకోర్టు న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్య తెలంగాణ వ్యాప్తంగా కలకలం రేపింది. అయితే, ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై… వామన్‌రావు దంపతుల హత్యపై విచారణ వేగవంతం చేయాలని లేఖలో ప్రభుత్వానికి కోరిన ఆమె… ఈ కేసులో దోషులకు శిక్ష పడేలా చూడాలని.. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని లేఖలో పేర్కొన్నారు. మరోవైపు.. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై ఇవాళ సమీక్షించారు గవర్నర్.. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన ఆమె.. పుదుచ్చేరి రాజ్ నివాస్ నుండి హైదరాబాద్ లోని రాజ్ భవన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. రాజ్ భవన్ ప్రవేశపెట్టిన ఈ-ఆఫీస్ విధానం ద్వారా తెలంగాణకు సంబంధించిన అంశాలకు సంబంధించిన ఫైళ్లను ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నామన్నారు. తెలంగాణకు సంబంధించిన ప్రతి అంశాన్ని, ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్లు గవర్నర్ తెలిపారు.చూడాలి మరి ఇప్పుడైనా ఏ ఘటన పై కేసీఆర్ స్పందిస్తాడా.. లేదా అనేది.

Related posts