telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

రాహుల్ దేశాన్ని విడదీసేలా మాట్లాడుతున్నారు…

soniya rahul

రాహుల్.. దేశాన్ని విడదీసేలా మాట్లాడుతున్నారని.. బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కాంగ్రెస్ నేత, వయనాద్ ఎంపీ రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ అసమర్థ ఎంపీ అని విమర్శించారు. ఆయన అమేథీ ప్రజలను అవమానించారని ఆరోపించారు. అమేథీలో ఓడిపోయిన తర్వాత రాహుల్ గాంధీ ఉత్తర ప్రదేశ్‌ మీద విద్వేషం చిమ్ముతున్నారని స్మృతి ఇరానీ ఘాటుగా విమర్శించారు.దేశాన్ని ముక్కలు చేయాలనుకునే గ్యాంగ్‌కు మద్దతు పలికారన్నారు. రాహుల్‌ గాంధీపై సీపీఎం కూడా తీవ్రంగా విరుచుకుపడింది. రాహుల్ గాంధీ అచ్చు బీజేపీలా మాట్లాడుతున్నారని మండి పడింది. బీజేపీని తీవ్ర స్థాయిలో దుయ్యబట్టడంలోనూ రాహుల్ విఫలం చెందారని ఆరోపించింది. కేరళ పర్యటన సందర్భంగా రాహుల్ తమపై విమర్శల దాడికి దిగారని… ఈ విమర్శలు అచ్చు బీజేపీ గొంతులా అనిపించాయని సీపీఎం నేతలు ఆరోపించారు. ఇలాంటి వ్యాఖ్యలే చాలా రాష్ట్రాల్లో బీజేపీ పాతుకుపోవడానికి కారణమయ్యాయని ధ్వజమెత్తింది. రాహుల్ తన పర్యటనలో బీజేపీని పల్లెత్తు మాట కూడా అనలేదని, ఇదంతా పార్టీ అధిష్ఠానం సూచనలతోనే జరిగిందని తాము భావిస్తున్నట్లు సీపీఎం తెలిపింది.

Related posts