telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సమ్మర్‌కు వస్తున్న బాలయ్య..

బాలకృష్ణ, బోయపాటి కాంబో అంటేనే తెలుగు ఇండస్ట్రీలో సంచలనాల కాంబోగా పేరు తెచ్చుకుంది. వీరిద్దరి కాంబోలో వచ్చిన రెండు సినిమాలు కూడా రికార్డులు సృష్టించాయి. ప్రస్తుతం వీరి కాంబోలో మూడో సినిమా రానుండటంతో ఈ చిత్రం కోసం నందమూరి అభిమానులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను మిరియాల రవిందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నారు. బాలకృష్ణతో తలపడేందుకు బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి సిద్దమవుతున్నాడు. ప్రస్తుతం ప్రతి హీరో తమతమ సినిమాల విడుదల తేదీలను ప్రకటిస్తున్నారు. కానీ బాలయ్య సినిమా గురించి ఎటువంటి అప్‌డేట్ రాకపోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ఈ రోజు సాయంత్రం 3గంటల 36 నిమిషాలకి అనౌన్స్ చేసింది నిర్మాణ సంస్థ ద్వారక క్రియేషన్స్. ఈ సినిమాను మే 28న రిలీజ్‌ చేయనున్నట్లు ఓ పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది చిత్ర బృందం. దీంతో బాలయ్య ఫ్యాన్స్‌ పండగ చేసుకుంటున్నారు.

Related posts