telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

హైకోర్టు న్యాయమూర్తిగా ఈ ప్రాంత వాసిని నియమించడం అదృష్టం: కొడాలి నాని

kodali nani ycp

ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ బట్టు దేవానంద్ కు ఆత్మీయ సత్కారం జరిగింది. కృష్ణా జిల్లా గుడివాడలోని స్థానికంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి మంత్రి కొడాలి నాని హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గుడివాడకు చెందిన బట్టు దేవానంద్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులవడం ఈ ప్రాంతం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు.

సమాజంలో అసమానతలు తొలగాలన్న భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయాన్ని నెరవేర్చేందుకు దేవానంద్ పాటుపడతారని ఆశిస్తున్నట్టు చెప్పారు. అనంతరం కావూరి సాంబశివరావు మాట్లాడుతూ, చరిత్రలో నిలిచిపోయేలా దేవానంద్ తీర్పులు ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నానని, సుప్రీంకోర్టు జడ్జి స్థాయికి ఆయన ఎదగాలని ఆశిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు, దర్శక–నిర్మాత వైవీయస్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

Related posts