నాగచైతన్య, సమంత పెళ్లి తర్వాత జంటగా తొలిసారి స్ర్కీన్ షేర్ చేసుకుంటున్న సినిమా “మజిలీ”. శివనిర్వాణ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మాణంలో రూపొందిన “మజిలీ” చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిత్రంలో సమంతతో పాటు దివ్యాన్ష కౌశిక్ మరో హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే కొన్ని చోట్ల ప్రీమియర్ షోలు ప్రదర్శించడంతో సినిమా టాక్ బయటకి వచ్చేసింది.
అమెరికాలో దాదాపు 150కి పైగా లొకేషన్లలో విడుదలైన ఈ సినిమాపై ఆడియన్స్ నుండి పాజిటివ్ రెస్పాస్ వస్తోంది. సమంత, చైతులు తమ పాత్రల్లో జీవించేశారని.. ఎమోషనల్ గా సాగిన కథను బాగా డీల్ చేశారని ట్వీట్లు పెడుతున్నారు. అక్కినేని నాగార్జునతో పాటు మరికొందరు సినిమాపై పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ”మజిలీ” చిత్రంలో సమంత, నాగచైతన్య బ్రిలియంట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. వాళ్లను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. రావు రమేశ్, పోసాని కృష్ణమురలి నటన అధ్బుతం” అంటూ నాగార్జున ట్వీట్ చేశారు.
కొందరు అభిమానులు చైతు కెరీర్ లో ఇదొక పెద్ద బ్రేక్ అని, తెరపై చైతు-సామ్ లు కనిపించలేదని వారి పాత్రలే కనిపించాయని, “ఏం మాయ చేసావే” తరువాత మళ్ళీ “మజిలీ”లోనే అలాంటి లవ్ సీన్ కన్పించిందని అంటున్నారు. అందమైన కథను దర్శకుడు చాలా సున్నితంగా డీల్ చేశాడని, లవ్, పెయిన్ రెండిటినీ బాగా ఫీల్ అవుతారని, సినిమాలో సమంతా, చైతు జీవించేశారని, పాత్రలకు ప్రాణం పోశారని అంటున్నారు. మొదటి సినిమా అయినా దివ్యాంక బాగా నటించిందని, తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, గోపిసుందర్ మ్యూజిక్ హృదయాలను హత్తుకునేలా ఉందని తెలుస్తోంది. ఇక నాగ చైతన్య యాంగ్రీ యాటిట్యూడ్, లవ్ ఫెయిల్యూర్ అయిన పాత్రలో తెరపై ఆకట్టుకున్నాడు. సమంత అతని జీవితంలోకి వచ్చాక ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి అనేది సినిమా ప్రధానాంశం. ప్రేమలో విఫలమై గాయపడిన భర్తతో సర్దుకోపోవడంలో సమంత కనబరిచిన అమాయకత్వం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
అర్జున్ రెడ్డి వర్సెస్ ఫలక్నుమాదాస్… బూతులతో విరుచుకుపడ్డ హీరో