కన్నడ భామ రష్మిక మందన్న సూపర్స్టార్ మహేష్ బాబుకు జోడీగా ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో నటిస్తున్నారు. మరోపక్క స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్కు జోడీగా ‘ఐకాన్’ సినిమాలో నటించనున్నారు. అంతేకాదు నితిన్కు జోడీగా ‘భీష్మ’ సినిమాలోనూ నటిస్తున్నారు. కెరీర్ మొదట్లోనే స్టార్ హీరోలతో సినిమా చేసే అవకాశం దక్కించుకున్నారు రష్మిక. బాలీవుడ్ నుంచి కూడా పిలుపు వచ్చింది. అది కూడా స్టార్ హీరో షాహిద్ కపూర్కి జోడీగా నటించే అవకాశం. కానీ ఓ సిల్లీ కారణం చెప్పి రష్మిక ఈ సినిమాను వదులుకుంది. తెలుగులో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న ‘జెర్సీ’ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. హిందీలో బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక మందనను ఎంపిక చేసుకోవాలనుకుంది చిత్రబృందం. కానీ రష్మిక నో చెప్పింది. ఇందుకు కారణం సినిమాకు ఎక్కువ పారితోషికం అడగటమేనని పలు బాలీవుడ్ వర్గాలు అన్నాయి. తాను జెర్సీ రీమేక్కు ఒప్పుకోకపోవడానికి రష్మిక అసలు కారణం వెల్లడించారు. సినిమాలో తన పాత్రకు న్యాయం చేయలేనేమో అన్న భయంతో ఈ సినిమాకు నో చెప్పారట. ‘నేను ఓ సినిమాలో నటిస్తున్నానంటే.. నా క్రియేటివిటీని మొత్తం సినిమాలోనే పెట్టాలి. నాకు అంత స్కోప్ లేనప్పుడు నేను సినిమాకు ఒప్పుకోను. జెర్సీ రీమేక్ భారీ సినిమా. ఎవరైనా సినిమాకు ఈజీగా ఓకే చేసేస్తారు. కానీ నేను సెట్కు వచ్చి అలసిపోలేను. జెర్సీ రీమేక్ టీంకు ఇంతకంటే ఎక్కువ దక్కాలి. ఎవరైతే బాగా ఎనర్జిటిక్గా ఉంటారో వారు ఈ సినిమాలో నటించగలుగుతారు. ఒక సినిమా హిట్టయినా ఫ్లాపయినా అది హీరో, హీరోయిన్లు ఇద్దరిపై ప్రభావం చూపుతుంది. సినిమా అంటే కేవలం డబ్బే కాదు మనం దాని కోసం ఎంత కష్టపడుతున్నామని’ అన్నారు.