ఎండల వేడికి చాలా మంది ఫ్రిజ్లలోని చల్లని నీటిని తాగుతున్నారు. కానీ ఒకప్పుడు మన పెద్దలు, పూర్వీకులు కేవలం మట్టికుండల్లో ఉంచిన నీటిని మాత్రమే తాగేవారు. నిజానికి ఆ నీరే మనకు ఆరోగ్యకరం. మట్టికుండల్లోని చల్లని నీటినే మనం తాగాలి. దానితో మనకు దాహం తీరడమే కాదు, అనేక ఆరోగ్యకర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. మరి మట్టికుండల్లోని నీటిని తాగితే మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం..
* మట్టి ఆల్కలైన్ స్వభావాన్ని కలిగి ఉంటుంది. అందువల్ల దాంతో తయారు చేసిన కుండలో నీటిని పోస్తే ఆ నీరు కూడా ఆల్కలైన్ స్వభావాన్ని పొందుతాయి. ఈ క్రమంలో ఆ నీటిని తాగితే మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. జీర్ణ సమస్యలు పోతాయి.
* మట్టికుండలో నీటిని తాగడం వల్ల శరీర మెటబాలిజం రేటు క్రమబద్దీకరించబడుతుంది. దీంతో బరువు నియంత్రణలో ఉంటుంది.
* మట్టికుండలో నీటిని తాగితే గొంతుకు సంబంధించిన సమస్యలు దూరమవుతాయి. గొంతు ఇన్ఫెక్షన్లు, నొప్పి ఉన్నవారు కుండల్లో నీటిని తాగడం మంచిది.
* అధిక బరువుతో బాధపడేవారు మట్టికుండల్లో నీటిని తాగడం మంచిది. దాంతో బరువు తగ్గుతారు.