telugu navyamedia
సినిమా వార్తలు

ఇది జస్ట్ ప్రారంభం మాత్రమే- ప్రకాశ్​రాజ్

‘మా’ ఎన్నికల్లో రోజుకో ట్విస్ట్ బ‌య‌ట‌ప‌డుతుంది. మా అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎన్నికై రెండు వారాలు గడుస్తున్నా.. సినీ ఇండస్ట్రీలో వివాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మా ఎన్నిక‌ల్లో వైకాపా ప్ర‌మేయం ఉందంటూ ప్రకాశ్​రాజ్ ట్వీట్ చేశారు.  ఈ మేరకు ఆయన మా ఎన్నికల అధికారికి ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు.

ఎన్నికలు జరుగుతున్న సమయంలో రౌడీ షీటర్లు ఓటర్లను బెదిరించారని ఆరోపించారు. విష్ణు ప్యానల్ నుంచి చాలామందిని నల్ల బ్యాడ్జీలతో ఎందుకు అనుమతించారని ఈసికి ప్రశ్నించారు.

“మా ఎలక్షన్స్ 2021… ఎలక్షన్ ఆఫీసర్ కృష్ణమోహన్ గారు ఇది జస్ట్ ప్రారంభం మాత్రమే… సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వండి… ఎన్నికలలో ఏం జరిగిందో ప్రపంచానికి తెలిసేలా చేస్తాము. ఎలక్షన్స్ ఎలా జరిగాయి? జస్ట్ ఆస్కింగ్ ” అంటూ కొన్నిఎన్నికల అధికారి కృష్ణ మోహన్ కి పంపడమే కాకుండా.. ట్విట్టర్ లో పోస్ట్ కూడా పెట్టారు.

Prakash Raj Tweet: రసవత్తరంగా 'మా' ఎన్నికలు | Prakash Raj Tweets About MAA Elections 2021 | Tollywood News Today

ఈ ఫోటోల్లో విష్ణు వెంట ఉన్నది నూకల సాంబశివరావు అలియాస్​ సాంబ అని చెబుతూ ఫొటోలను ప్రకాశ్​రాజ్ విడుదల చేశారు. అతడిపై క్రిమినల్​ కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. గతంలో ఓ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. అనేక బెదిరింపులు, సెటిల్‌మెంట్ల కేసులు ఉన్నాయి.ఎఫ్​ఐఆర్ కాపీలను పోస్ట్ చేశారు.

కాగా..సాంబశివరావు ఎన్నికలు జరుగుతున్న సమయంలో మోహన్ బాబు పక్కనే ఉండడం కనిపిస్తోంది. కేవలం ఎన్నికల్లోనే కాకుండా అతను మోహన్ బాబు కుటుంబంతో సన్నిహితంగా ఉంటున్నట్లు ఆ ఫోటోలు చూస్తే అర్థమవుతుంది. ఇక ఆయన ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో కూడా కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేశారు ప్రకాష్ రాజ్. ఈ ఎలక్షన్​లో వైకాపా జోక్యం ఉందని ఈ పోటోలు చూస్తే అర్ధ‌మ‌వుతుంది.

Related posts