స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో తన 19వ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. సుశాంత్, నివేదా పేతురాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రధాన పాత్రలో అలనాటి అందాల తార టబు నటిస్తుంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. హారికా హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం కాకినాడలో తదుపరి షెడ్యూల్ జరుపుకుంటుంది. ఇందులో భాగంగా బన్నీ కాకినాడకి వెళ్ళగా ఆయనకి గ్రాండ్ వెల్కమ్ లభించింది. బన్నీపై పూల వర్షం కురిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు ఆయన ఫ్యాన్స్. అయితే ఈయనపై ఇప్పుడు మెగా కంపౌండ్ గుర్రుగా ఉందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ కాకినాడ వెళ్లినపుడు అక్కడ ఆయన పేరు మీద ‘అల్లు అర్జున్ ఆర్మీ’ వచ్చి స్వాగతం పలికింది. తూర్పు గోదావరి జిల్లాలో సాధారణంగా చిరు, పవన్ అభిమానులు ఎక్కువగా ఉంటారు.ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. అల్లు అర్జున్ ఆర్మీ అనే స్లోగన్స్ అచ్చు జనసేన పార్టీ కలర్ జెండాలా ఉండటంతో ఇప్పుడు అసలు రచ్చ మొదలైంది. జనసేన అక్కడ ఓడిపోయినా కూడా ఓట్ల శాతం మాత్రం భారీగానే ఉంది. అలాంటి ప్రదేశంలో అల్లు అర్జున్ ఆర్మీ కనిపించడం నిజంగానే మెగా హీరోలకు షాక్.
previous post
ఫస్ట్ నీ సినిమాల్లో నువ్వు ఎక్స్పోజింగ్ తగ్గించు… మంచు లక్ష్మిపై జర్నలిస్ట్ సంచలన వ్యాఖ్యలు