పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం “ఇస్మార్ట్ శంకర్”. పూరి జగన్నాథ్, ఛార్మి నిర్మించిన ఈ చిత్రంలో నభా నటేష్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం జూలై 18న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. సక్సెస్ఫుల్గా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతూ ఇస్మార్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచి రూ.75 కోట్ల గ్రాస్ను సాధించింది. ఈ సందర్భంగా శనివారం చిత్రయూనిట్ సక్సెస్మీట్ నిర్వహించారు. మరోవైపు “ఇస్మార్ట్ శంకర్” మూవీకి సంబంధించిన పోస్టర్ల పై వివాదం రాజుకుంటోంది. జాయింట్ డైరెక్టర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ ఫెయిర్ డిపార్ట్ మెంట్ టొబాకో ప్రొడక్ట్స్ చట్టానికి విరుద్ధంగా ఈమూవీ పబ్లిసిటీ పోస్టర్స్ ఉన్నాయని అందువల్ల వాటి పై వివరణ ఇవ్వవలసిందిగా పూరీకి అదేవిధంగా రామ్ కు నోటీసులు ఇచ్చినట్లు టాక్. రామ్ సిగరెట్ తాగుతూ కనిపిస్తున్న పోస్టర్లు అనేక మల్టీ ఫ్లెక్స్ ధియేటర్లలో కనిపించిన పరిస్థితులలో సిగరెట్ కాల్చడం హానికరం అన్న అక్షరాలు లేకుండా పోస్టర్లు వేయడం సెక్షన్ 5 టొబాకో యాక్ట్ కు ఉల్లంఘన అని చెపుతూ ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. దీంతో పూరీ ప్రభుత్వ డిపార్ట్ మెంట్ వ్యవహారం కాబట్టి దానికి సరైన సమాధానం ఇవ్వడానికి తన సన్నిహితులైన లాయర్స్ సలహాలు తీసుకుంటున్నట్లు టాక్.
previous post