భూగోళానికి అధిక స్థాయిలో 20 శాతం ఆక్సీజన్ని అందిస్తున్న అమెజాన్ అడవులను కాపాడాలంటూ పిలుపునిస్తున్నారు. దీనిపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతుంది. బ్రెజిల్కు చెందిన ఆ అడవులు ప్రతి ఏడాది రికార్డు స్థాయిలో దగ్ధం అవుతున్నాయి. ఆ దేశానికి చెందిన స్పేస్ ఏజెన్సీ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది. పర్యావరణ వేత్తలు, శాస్త్రవేత్తలు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు దీనిపై స్పందిస్తున్నారు. ఇప్పటికైన మేల్కొని అమెజాన్ని కాపాడుకుందాం అని పిలుపునిస్తున్నారు. టాలీవుడ్ నుండి మొదటగా మహేష్ బాబు స్పందించారు. “ఈ వార్త చాలా భాదాకరమైనది. 20 శాతం ఆక్సీజన్ని అందించే అమెజాన్ అడవులు మంటలలో కాలిపోతున్నాయి. ఇప్పటికైన మేల్కొని అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ని కాపాడుకుందాం. జీవ వైవిధ్యం చాలా దెబ్బతింటుంది. మన భూమిని రక్షించుకోవడానికి మన వంతు కృషి చేద్దాం. పచ్చని వాతావరణం కోసం ఒక అడుగు ముందుకు వేయండి. అది మన ఇంటి నుండి ప్రారంభిద్దాం” అని మహేష్ పిలుపునిచ్చారు. సాయిధరమ్ తేజ్, అర్జున్ కపూర్, అనుష్క శర్మ, దిశా పఠానీతో పాటు పలువురు ప్రముఖులు అమెజాన్ అడవులని కాపాడుకుందాం అని సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ని కోరుతున్నారు.
Deeply disturbing news… the #AmazonRainforest, rightfully called the ‘lungs of our planet’… contributing to 20% of the world’s oxygen is on fire!!! This is a wake-up call for all of us who are taking our planet for granted… #PrayfortheAmazon pic.twitter.com/FNbSJnyNvJ
— Mahesh Babu (@urstrulyMahesh) August 22, 2019
హీరోయిన్ అంజలి, హీరో జై ఓకే రూమ్ లో… నిర్మాత షాకింగ్ కామెంట్స్