telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అల్లు అరవింద్, కరణ్ జోహార్ నిర్మాతలుగా ప్రభాస్ భారీ చిత్రం…?

Prabhas

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమాకు ‘ఓ డియర్’, ‘రాధేశ్యామ్’ అనే టైటిల్స్ లో ఒకదానిని ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది. ఆ తరువాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేయనున్నాడు. విభిన్నమైన కథాకథనాలతో ఈ సినిమా నిర్మితం కానుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. సూపర్ హీరోగా ప్రభాస్ కనిపించే ఈ సినిమా కోసం అత్యధిక బడ్జెట్ ను కేటాయించినట్టు తెలుస్తోంది. ఆ తరువాత ప్రభాస్ చేయనున్న సినిమా కూడా వందల కోట్ల బడ్జెట్ తో ఉండబోతోంది అనే టాక్ వినిపిస్తోంది. అల్లు అరవింద్ – కరణ్ జొహార్ కలిసి ఈ సినిమాను నిర్మించనున్నారని అంటున్నారు. కథ ఏమిటి? దర్శకుడు ఎవరనేది ఆసక్తికరంగా మారింది. హిందీ, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నట్టుగా సమాచారం. 2022లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని అంటున్నారు. త్వరలోనే మిగతా వివరాలు తెలిసే అవకాశం ఉంది.

Related posts