జీహెచ్ఎంసీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు నగరంలో నూతన సిగ్నల్ విధానాన్ని అమల్లోకి తెస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులపై బాలీవుడ్ సూపర్స్టార్ అమితాబ్ బచ్చన్ ప్రశంసల జల్లు కురిపించారు. నగరంలోని పలు కూడళ్లలో జీబ్రా క్రాసింగ్స్ వద్ద రంగులు మారే ఎల్ఈడీ లైట్లను అమర్చారు ట్రాఫిక్ అధికారులు. ఈ అమరిక వల్ల జీబ్రా క్రాసింగ్కు కొద్దిగా ముందుగానే వాహనదారులు తమ వాహనాలను నిలిపివేయాల్సి వస్తుంది. దీంతో పాదచారులు సులువుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు రోడ్డును దాటుతున్నారు. ఈ లైట్ల అమరికతో మరో వైపు వాహనదారుల్లో రహదారి క్రమశిక్షణ సైతం అలవడుతుంది. ఈ నూతన విధానం గురించి తెలిసిన అమితాబ్ బచ్చన్ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల పనితీరును ప్రశంసించారు. అత్యంత ప్రభావవంతంగా పనిచేసే సూపర్ ఆలోచన ఇది అని కొనియాడారు.
next post