ఈరోజు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య, నటి నమ్రతా శిరోద్కర్ పుట్టినరోజు. 1993లో మిస్ ఇండియాగా టైటిల్ గెలుచుకున్న నమ్రతా శిరోద్కర్ మోడల్ గా పనిచేశారు. జబ్ ప్యార్ కిసీసే హోతాహై (1998), మేరే దో అన్మోల్ రతన్ (1998), ఎల్వోసీ కార్గిల్(2003) వంటి హిందీ సినిమాల్లో నటించారు. ఆ తరువాత తెలుగులో వంశీ, అంజి, టక్కరిదొంగ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ తరువాత ఫిబ్రవరి 10న మహేష్ బాబు, నమ్రత ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇప్పుడు వారికి ఇద్దరు పిల్లలు. ఒక కుమారుడు గౌతమ్, కుమార్తె సితార. ఇప్పటికీ ఈ దంపతులిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటారు. నమ్రత పుట్టినరోజు సందర్భంగా మహేష్ బాబు తన భార్యకు ట్విట్టర్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. “నా ప్రియమైన నమ్రతకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నా జీవితంలో ప్రతీక్షణం అండగా నిలిచినందుకు థ్యాంక్యూ. లవ్ యూ” అంటూ ట్వీట్ చేశారు. మహేష్ బాబు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా… తగిన ప్లానింగ్ తో తన కుటుంబానికి తగినంత సమయాన్ని కేటాయిస్తారు. వాళ్ళతో హ్యాపీగా గడుపుతుంటారు.
Happy birthday, My sweetest love❤ Thank you & Love you for everything that you mean to me🤗 pic.twitter.com/SYjI3F4qQU
— Mahesh Babu (@urstrulyMahesh) January 22, 2019
నాకు పగ, రాగద్వేషాలు లేవు..