telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీ ఉద్యోగుల వేతనాల్లో కోత

Hyderabad Police Seize Three Crores

ఏపీలో లాక్‌డౌన్‌ అమలవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆధాయం భారీగా తగ్గింది. ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఉద్యోగుల వేతనాల్లో కోత విధించింది. ప్రజాప్రతినిధుల జీతాల్లో వందశాతం కోత విధిస్తున్నట్లు పేర్కొంది.

ఆలిండియా సర్వీస్‌ అధికారుల వేతనాల్లో 60 శాతం, ఉద్యోగుల జీతాల్లో 50 శాతం కోత విధించింది. దీనికి సంబంధించి మంగళవారం సాయంత్రం ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు విడుదల చేయనుంది. కాగా కోత విధించిన జీతాన్ని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడ్డాక వారికి తిరిగి చెల్లిస్తారని అధికార వర్గాల సమాచారం.

Related posts