telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

ముగిసిన భారత్ ఇన్నింగ్స్ … ఇంగ్లాండ్ టార్గెట్…?

మేతేరా వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న నాలుగో టీ20 లో టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసిన టీం ఇండియా రాణించింది. ఇన్నింగ్స్ మొదటి బంతినే సిక్స్ బాదిన రోహిత్ శర్మ ఆ తర్వాత 12 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. కానీ ఆ తర్వాత బ్యాటిగ్ కు వచ్చిన సూర్య కుమార్ యాదవ్(57) అర్ధశతకంతో రాణించాడు. అయితే సూర్య కు ఇది రెండో మ్యాచ్ అయిన మొదటి మ్యాచ్ లో బ్యాటింగ్ చేసే అవకాశం లభించలేదు. కానీ ఈ మ్యాచ్ లో వన్ డౌన్ లో వచ్చిన సూర్య అంతర్జాతీయ కెరియర్ లో మొదటి బంతినే సిక్సర్ గా మలిచి ఆ తర్వాత 28 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే సూర్య ఔట్ అయిన తర్వాత పంత్(30), శ్రేయాస్ అయ్యర్(37) తో రాణించడంతో భారత్ నిర్ణిత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. ఇక ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ గెలవాలంటే 186 పరుగులు చేయాలి. అయితే ఈ మ్యాచ్ భారత జట్టుకు చాలా కీలకం. ఎందుకంటే ఇప్పటికే జరిగిన మూడు మ్యాచ్ లలో రెండు ఓడిపోయిన టీం ఇండియా ఈ మ్యాచ్ లో కూడా ఓడిపోతే సిరీస్ కోల్పోయినట్లే. చూడాలి మరి ఈ మ్యాచ్ లో ఏం జరుగుతుంది అనేది.

Related posts