telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

జీహెచ్ఎంసీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్‌..ఐదుగురు ఇంచార్జిల నియామకం

ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో అనూహ్యంగా విజయం సాధించిన బీజేపీ… త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు ప్రణాళికలు వేస్తోంది. ఇందులో భాగంగా పార్టీ రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే వివిధ స్థాయిల్లో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపే యత్నం చేస్తోంది. ఇక కేడర్ను ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీని సైతం ప్రకటించింది. కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఈ కమిటీకి చైర్మన్ గా వ్యవహరించనుండగా…పార్టీ కేంద్ర ఓబీసీ అధ్యక్షుడు లక్ష్మణ్ కన్వీనర్ గా వ్యవహరించనున్నారు. ఈ కమిటీలో పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటుగా పార్టీలోని సీనియర్ నాయకులందరికీ స్థానం కల్పించారు. దీంతోపాటుగా జీఎచ్ఎంసీ ఎన్నికల ఇంచార్జి గా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, బీహార్ పార్టీ ఇంచార్జి భూపేంద్ర యాదవ్ ను, సహా ఇంచార్జి లుగా కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్, కర్ణాటక ఎమ్మెల్యే సతీష్ రెడ్డి, గుజరాత్ కు చెందిన ప్రదీప్ సింగ్ వాఘేల, మహారాష్ట్ర కు చెందిన ఆశిష్ షెల్లర్ లను నియమిస్తున్నట్లు ప్రకటించారు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. దీంతో జీఎచ్ఎంసీ ఎన్నికలకు బీజేపీ శంఖారావం పూరించినట్లుగా స్పష్టమవుతోంది.

Related posts