హైకోర్టుతో రాయలసీమకు ఎలాంటి ప్రయోజనం లేదని టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. రాయలసీమ నుంచి విశాఖకు సరైన రోడ్డు సౌకర్యం కూడా లేదని చెప్పారు. ప్రత్యేక రాయలసీమకు జగన్ శంకుస్థాపన చేశారని, రెండేళ్లకోసారైనా రాయలసీమకు వచ్చి తీరాల్సిందేనని చెప్పారు.
జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై కేంద్రం వేచి చూసే ధోరణని అవలంబిస్తోందన్నారు. సచివాలయంతో సామాన్య ప్రజలకు పని లేదని మంత్రులు అంటున్నారని ఆయన మండిపడ్డారు. జగన్ తాను అనుకున్నదే జరగాలని, ఇతరుల అభిప్రాయాలు అవసరం లేదనుకుంటున్నారని జేసీ విమర్శించారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిక్క వ్యక్తి అని… ఆయన చెప్పేంత వరకు ఎవరీకి ఏదీ తెలియదని అనుకుంటుంటారని ఎద్దేవా చేశారు. అమరావతి ప్రాంతంలో ఆడ, మగ అనే తేడా లేకుండా పోలీసులు చావబాదుతున్నారని మండిపడ్డారు. బ్రిటీష్ వారి హయాంలో కూడా ఇలా జరగలేదని జేసీ వ్యాఖ్యానించారు.
ప్రశ్నించే గొంతుంటేనే పేద ప్రజలకు న్యాయం: ఎంపీ కోమటిరెడ్డి