telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పోలీసుల కళ్లుగప్పి నిరసన ప్రాంతానికి చేరుకున్న కొల్లు రవీంద్ర!

kollu ravindra

మాజీ మంత్రి కొల్లు రవీంద్రను మచిలీపట్నంలో నిరసన కార్యక్రమానికి హాజరు కాకుండా అడ్డుకోవాలన్న పోలీసుల వ్యూహం భగ్నమైంది. ఈ ఉదయం నుంచి కొల్లు ఇంటి చుట్టూ పోలీసులు భారీ ఎత్తున బలగాలను మోహరించగా, వారి కళ్లుగప్పి, ఇంట్లో నుంచి వెళ్లిపోయిన కొల్లు, నిరసన ప్రాంతానికి చేరుకున్నారు. ఇంటి వెనుకవైపు నుంచి అవతలి వీధిలోకి ఆయన వచ్చి, ముందుగా అక్కడ ఏర్పాటు చేసిన వాహనం ద్వారా నగర నడిబొడ్డున ఉన్న కోనేరు సెంటర్ కు చేరుకున్నారు.

ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, రాష్ట్ర పోలీసులు ప్రభుత్వానికి కొమ్ముగాస్తున్నారని విమర్శలు గుప్పించారు. పోలీసుల తీరును తప్పుబట్టిన ఆయన, శాంతియుతంగా ఆందోళన చేసే వారిని అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇసుక కొరత కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు.

Related posts