telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు సామాజిక

యాత్రికులపై దూసుకెళ్లిన బస్సు.. ఏడుగురు దుర్మరణం

Accident

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలోని బులంద్‌షహర్‌లోని నరౌరా వద్ద రహదారి పక్కన నిద్రిస్తున్న యాత్రికులపై నుంచి బస్సు దూసుకెళ్లింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు.మృతుల్లో నలుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు.

గంగానదిలో నరౌరా ఘాట్‌ వద్ద స్నానానికి వెళ్లిన వారికి ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే బస్సును వదిలి డ్రైవర్ పరారయ్యాడు. బస్సులో వైష్ణోదేవి యాత్రకు వెళ్లి వస్తున్న భక్తులు ఉన్నారు.

Related posts