telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

విశాఖ : .. మరోబస్సు ప్రమాదం.. ముగ్గురు మృతి…

Road accident 8 dead and 30 injured

అతివేగం ప్రాణాలమీదకు తెస్తుంది అని ఎంతగా చెప్పినా వినిపించడంలేదు.. ఇది అర్ధం అయ్యేట్టు ఏ పద్దతిలో చెప్పాలో ప్రభుత్వానికీ తోచడంలేదేమో.. రోజు ఎన్నో ప్రాణాలు ఈ వేగం వలనే పోతున్నాయి. తాజాగా, విశాఖపట్టణం జిల్లా పాడేరు మండలం వంట్లమామిడి ఘాట్ రోడ్డులో ప్రైవేటు టూరిస్టు బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. మరో 37 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం అనకాపల్లిలోని ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న నలుగురిని విశాఖలోని కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు.

వర్షం కారణముగా ప్రమాదం జరిగిన మూడు గంటలకు గాని సహాయక చర్యలకు ఉపక్రమించాల్సి రావటంతో ప్రమాదతీవ్రత మరింతగా ఎక్కువ అయ్యింది. దీంతో క్షతగాత్రులు ఇబ్బంది పడ్డారు. తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడకు చెందిన బాధితులు రాయ్‌గఢ్‌లోని మజ్జి గౌరమ్మ అమ్మవారి దర్శనానికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

Related posts