telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

నా బౌలింగ్ తట్టుకోలేరు..అందుకే ఎప్పుడు ప్రయోగించలేదు .. : కోహ్లీ

london municipal office challan to kohli

రేపు మాంచెస్టర్ లో ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లో భాగంగా టీమిండియా, న్యూజిలాండ్ మధ్య సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కు ముందు భారత సారథి విరాట్ కోహ్లీ మీడియాతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సరదాగా సమాధానమిచ్చాడు.

పిచ్ పై జారిపడనంతవరకు తనకంటే ప్రమాదకరమైన బౌలర్ ఎవరూ ఉండరని జోక్ చేశాడు. తాను మ్యాచ్ లో ఏ సమయంలోనైనా బౌలింగ్ చేయగల దిట్టనని, అయితే పిచ్ పై పడిపోకుండా చూసుకోవడమే తనముందున్న అతిపెద్ద సమస్య అంటూ చమత్కరించాడు. తాను కూడా బౌలర్ నే కాబట్టి ఐదుగురు బౌలర్ల కాంబినేషన్ ను న్యూజిలాండ్ తో సెమీస్ మ్యాచ్ లో చూస్తారంటూ కోహ్లీ అందరినీ నవ్వించాడు.

Related posts