మాస్ మహారాజా రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం “క్రాక్”. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన యథార్థ ఘటనలను ఆధారంగా చేసుకుని ఈ సినిమా రూపొందిస్తున్నారు. సరస్వతి ఫిలిం డివిజన్ బ్యానర్లో బి. మధు నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. చిత్రంలో రవితేజ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా నటిస్తుండగా, ఆయన సరసన శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. సముద్రఖని, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక దీని తర్వాత రవితేజ మరిన్ని ప్రాజెక్టులను కూడా లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. వాటిలో దర్శకుడు రమేష్ వర్మతో ప్లాన్ చేసిన చిత్రం కూడా ఒకటి. పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించనున్న ఈ చిత్రంలో రవితేజ సరసన ఇద్దరు టాప్ హీరోయిన్స్ ను దర్శకుడు లాక్ చేసినట్టు తెలుస్తుంది. ఈ చిత్రంలో లేటెస్ట్ సెన్సేషన్ నిధి అగర్వాల్, అను ఇమ్మాన్యుయల్ ను హీరోయిన్స్ గా ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. ఈ చిత్రం ఈ అక్టోబర్ మూడో వారంలో హైదరాబాద్ లో మొదలు కానున్నట్టు సమాచారం.
previous post
next post