telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయిన కేంద్రమంత్రి సదానందగౌడ

కేంద్రమంత్రి డీవీ సదానంద గౌడ ఆకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం ఉదయం శివమొగ్గలో నిర్వహించిన బీజేపీ కార్యక్రమానికి సదానంద గౌడ హాజరయ్యారు. అనంతరం బెంగళూరుకి తిరుగుపయనమయ్యారు. అయితే.. మధ్యాహ్నం కావడంతో రక్తంలో షుగర్‌ లెవల్స్‌ పడిపోవడంతో సదానంద గౌడ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. శివమొగ్గ నుంచి బెంగళూరుకు వెళ్తుండగా.. మార్గం మధ్యలో చిత్ర దుర్గ సమీపంలో ఆయన తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయనను ఆస్పత్రిలో చేర్చినట్లు అధికారిక వర్గాల సమాచారం. అయితే… కేంద్ర మంత్రి సదానంద గౌడ ఆరోగ్యం ప్రస్తుతం మెరుగ్గా ఉందని… ఆస్పత్రిలో టెస్టులు నిర్వహించిన తర్వాత ఆరోగ్య ప్రకటన వెలువడనుందని సమాచారం. చిత్రదుర్గలో బసవేశ్వర మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో చేర్చిన ఆయనను.. మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి లో చేర్చారు. ఈ ఘటనపై బీజేపీ సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా షాక్‌ తిన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని… ఎప్పటిలాగే ప్రజా కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆకాంక్షించారు.

Related posts