భువనేశ్వర్ ఎయిమ్స్లో పనిచేస్తున్న మహిళ హౌసింగ్ సొసైటీలోని ఓ ఫ్లాట్ను అద్దెకు తీసుకుని ఉంటోంది. ఒడిశాలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అనేక మంది అనుమానితులకు ఎయిమ్స్లో ఐసోలేషన్లో ఉంచి టెస్టులు చేస్తున్నారు. ఆ విభాగంలో పనిచేస్తున్న ఆమె ద్వారా తమ సొసైటీలో కరోనా ప్రబలుతుందని స్థానికులు భయపడుతున్నారు దీంతో ఫ్లాట్ ఖాళీ చేయాల్సిందిగా ఆమెను కొద్దిరోజులుగా కోరుతున్నారు. అయితే వెంటనే ఫ్లాట్ ఖాళీ చేయాలంటే కుదరదని, కొద్దిరోజులు టైమ్ ఇవ్వాలని ఆమె కోరింది. ఎన్నిసార్లు చెప్పిన ఆ లేడీ డాక్టర్ ఫ్లాట్ ఖాళీ చేయకపోవడంతో హౌసింగ్ సొసైటీకి చెందిన ఆఫీస్ బేరర్ రంగంలోకి దిగాడు. ఆమె ఫ్లాట్కు వెళ్లి బెదిరించాడు. ఆమె పట్టించుకోకపోవడంతో తనకు అమ్మాయిల పిచ్చి ఎక్కువని, మాట వినకపోతే రేప్ చేస్తానని బెదిరించాడు. దీంతో దిగ్భ్రాంతికి గురైన ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నందునే తనను ఫ్లాట్ ఖాళీ చేయాలని వేధిస్తున్నారని, రేప్ చేస్తామని బెదిరిస్తున్నారి బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.